వర్షాకాలం, చలికాలంలో చిక్కుడు సాగు అనుకూలం. చిక్కుడు అతి చలిని, అతి ఎండను తట్టుకోలేదు. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. పందిరి చిక్కుడు, పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కాపు కోసం కూడా 4-5 నెలలు వేచి ఉండాలి. ఒక కాలంలోనే సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. పొద చిక్కుడులో మంచి రకాలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి పందిరి చిక్కుడు సాగు కనిపించడం లేదు. పొద చిక్కుడు మూడునెలల వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది. సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు లాభాలు పొందవచ్చు.
పొద చిక్కుడు మూడు కాలాల్లో సాగు చేసకోవచ్చు. వానకాలంలో పండించే పంటలో మంచి నాణ్యత గల కాయను పొందవచ్చు. దిగుబడులు కూడా బాగా ఉంటాయి.

డాక్టర్ పిడిగెం సైదయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, 7780509322

వాడుకలో ఉన్న రకాలు:

పందిరి రకాలు:

ఆర్.ఎన్.డి-1, పూసా ఎర్లీ ప్రొలిఫిక్, దీపాలివాల్, పూసాసెయ్-2, పూసాసెయ్-3

పొదరకాలు:

అర్కాజయ, అర్కావిజయ, కొంకణ్ భూషణ్

పందిరి చిక్కుడు రకాలు:

ఆర్.ఎన్.డి-1

15-18 టన్నులు/ ఎకరాకు. 210-240 రోజులు. ముడుతలు పడకుండా తాజాగా ఉంటాయి.
ఉంటాయి. అధిక దిగుబడినిచ్చే పందిరి రకం. కాయలు రవాణాకు అనకూలం. కాయలు కోసిన నాలుగైదు రోజుల వరకు కాయలు వండేటప్పుడు మంచి వాసన కలిగి ఉంటాయి.

పూసా ఎర్లీ ప్రొలిపిక్

14 టన్నులు/ ఎకరాకు 200-215 రోజులు. కాయలు సన్నగా కొడవలి ఆకారంలో ఉంటాయి. 9.3 సెం.మీ పొడవు, 1.5 సెం.మీ వెడల్పుతో ఉంటాయి.


దీపాలివల్

6-8 టన్నులు. 200-210 రోజులు. కాయలు చాలా పొడవుగా ఆకుపచ్చ రంగులో గింజలున్న దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది.


పూసా సెయ్-2

22 టన్నులు. 200 రోజులు. ఈ రకం పేనుబంక, తేనెమంచు పురుగులను, కాయ తొలిచే పరుగులను చలిని కూడా తట్టుకొంటుంది.


పొద చిక్కుడు రకాలు:
అర్క జయ

4.8 టన్నులు/ఎకరాకు. 90-100 రోజులు. కాయలు లేత ఆకుపచ్చ రంగులో కొద్దిగా వంపు తిరిగి ఉంటాయి.

4.8 టన్నులు/ఎకరాకు. 95-100 రోజులు . కాయలు పొట్టిగా, ముదురాకుపచ్చ రంగులో వాసన కలిగి ఉంటాయి.


కొంకణ్ భూషణ్

5 టన్నులు/ఎకరాకు. 100 రోజులు . కాయలు చాలా లేతగా ఉంటాయి. సమయంలో పంటకు 20-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. గాలిలో అధిక తేమతో తెగుళ్లు, ఇతర రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.


నేల

ఉదజని సూచిక −7.7.5 మధ్య ఉండి, మధ్యస్తు తేలికపాటి నుంచి నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. నీటి నిల్వ ఉండే భూములు, నల్లరేగడి భూములు ఈ పంటకు అతిగా అనుకూలం కాదు. అధికంగా గాలిలో తేమ ఉండే నేలల్లో ఈ పంట వేయకపోవడమే మేలు.


నేల తయారీ

నేలలో నీరు ఇంకే విధంగా తయారు చేసుకోవాలి. ముందుగా ఎండాకాలంలో లోతు దుక్కి చేసి, తర్వాత నాలుగైదుసార్లు దుక్కి దున్నాలి. విత్తడానికి 15 రోజుల ముందు హెక్టారుకు 2.5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేయడం మంచిది. పప్పుధాన్యపు పంట కాబట్టి భూమిలో నత్రజనిని స్థాపించి భూసారాన్ని కాపాడుతుంది.


విత్తనశుద్ధి

విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రా కార్బడింజం కలిపి విత్తనశుద్ధి చేయాలి లేదా కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి లేదా 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరమ్లో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేసుకోవాలి. సిఫార్సు చేసిన రైజోబియం జీవన ఎరువును కిలో విత్తనాలకు 40 గ్రాముల చొప్పున పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 250 గ్రాముల బెల్లం ద్రావకంలో కలిపి లీటరు నీటిలో ఉంచి ద్రావణం తయారు చేసుకోవాలి. ఆ రైజోబియం మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. తర్వాత నీడలో అరగంట పాటు ఎండబెట్టాలి. 24 గంటల లోపు ఎండిన విత్తనాలను నేలలో విత్తాలి.


విత్తన మోతాదు:

ఎకరాకు తీగ రకాలకు 0.8-1.2 కిలోలు, పొద రకాలకు 12-16 కిలోల విత్తనం కావాలి.


విత్తే సమయం:

తీగ (పందిరి) రకాలను జూన్ రెండవ వారం నుంచి జూలై చివరి వరకు, పొద రకాలను వర్షాకాలంలో (జూన్-జూలై) యాసంగి (సెప్టెంబర్-అక్టోబర్) ఎండాకాలం (జనవరి-ఫిబ్రవరి) కాలాల్లో విత్తుకోవచ్చు.

విత్తటం:

పందిళ్లపై పెంచే పంటకు 2-2.5 మీటర్ల దూరంలో కాలువలు చేసిన 1.5-2.0 మీటర్ల దూరంలో పాదులు చేసి ఒక్కొ పాదులో 3-4 విత్తనాలు పెట్టాలి. 30X30X30 గుంటల్లో విత్తుకోవాలి.
పాదరకాలలో విత్తనాలను బోధలు, చాళ్ల పద్ధతుల్లో విత్తుకోవాలి. వరుసల మధ్య రెండు అడుగులు, మొక్కల మధ్య ఒకటిన్నర అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన వెంటనే నీళ్లు పెట్టాలి. 5-7 రోజుల తర్వాత బలమైన రెండు మొక్కలు ఉంచి మిగతావి తీసివేయాలి. నాగలితో లేదా సీడ్తోల్తో విత్తనం వేసుకోవాలి.

ఎరువులు:

ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ తో పాటుగా మొదటి దఫా 15 కిలోల నత్రజని వేసి కలియదున్నాలి. రెండవ దఫాగా 15 కిలోల నత్రజనిని, 15 కిలోల పొటాష్ విత్తిన 30 రోజులకు వేయాలి. ఎరువులు వేసిన వెంటనే నీళ్లు కట్టాలి. దీనితో చిక్కుడులో పూత కాపునకు వస్తుంది.

నీటి యాజమాన్యం:

పాదుల్లో 2-3 సెం.మీ లోతుగా నేల పొడిబారినప్పుడు నీళ్లు కట్టాలి. పాదుల్లో నీళ్లు నిలువకుండా చూడాలి. వర్షాలు లేనప్పుడు 10-15 రోజుల వ్యవధిలో నీటిని కట్టుకోవాలి.

అంతరకృషి:

పూత, కాత సమయంలో అంతరకృషి చేయకూడదు. ఒకవేళ చేస్తే పూత రాలిపోతుంది. పాదుల్లో మట్టిని గుల్లగా చేయాలి. తీగ సాగే దశలో పురికొసతో కట్టి తీగలను పందిరిపైకి పాకించాలి. ఒకవేళ పూతదశలో వర్షాలు ఎక్కువగా పడితే పూత రాలుతుంటే ఒక శాతం యూరియా, ద్రావణం లేదా ప్లానిపిక్స్ ఒక మి.లీ 4.5 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
చిక్కుడు సాగులో గడ్డిజాతికి చెందిన మొక్కలు కలుపుగా ఎక్కువ సమస్య వస్తుంది. కాబట్టి కలపు నివారణకు పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.25 లీ లేదా అలాక్లోర్ 1.0 లీ (తేలిక నేలలు) 1.25 లీ (బరువు నేలలు) చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిని 48 గంటలలోపు పిచికారీ చేయాలి.

సస్యరక్షణ:
పురుగులు

పెంకు పురుగు: మొదటి దశ మొక్కల్లో ఆకులను కొరికి, తిని పంటకు తీరని నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు కార్బిరిల్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పేను బంక, తామర పురుగులు:

ఈ పురుగులు ఆకులను, పూత దశలో పూలపై ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల మొక్కలు పండుబారి పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
నివారణ: ఈ పురుగు నివారణకు డైమిథోయేట్ లేదా మిథెల్ డెమటాన్ లూదా ఫిప్రొనిల్ మందు 2 మి.లీ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో చెట్టుకు పిచికారీ చేయాలి.

కాయతొలుచు పురుగు:

పూత దశలో, కాయ దశల్లో ఈ పురుగు కాయల్లోని మంచి పదార్థాలను తినేసి కాయ నాణ్యత తగ్గేలా చేస్తుంది. కాయంత డొల్లగా మారిపోతుంది.
నివారణ:ఈ పురుగు నివారణకు మలాథియాన్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశ నుంచి మొదలుపెట్టి 10 రోజుల వ్యవధిలో మళ్లీ పిచికారీ చేయాలి. 5 శాతం వేప కషాయం లేదా 5 మి.లీ వేపనూన లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని తయారు చేసుకుని క్రమపద్ధతిలో పరుగుల నివారణకు వాడుకోవాలి.

తెగుళ్లు:
ఆంత్రాక్నోస్, తప్పుతెగులు, ఆకుమచ్చ తెగుళ్లు:

చిక్కుడు సాగులో ఆకుమచ్చ తెగుళ్లు అధిక నష్టం కలిగిస్తుంది. వాతావరణం చల్లగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఆకుమచ్చ తెగుళ్లు ఏర్పడుతాయి. ఇవి ముదురు ఆకులపై గుండ్రంగా లేదా ఆకారం లేని గోధుమ రంగు మచ్చలు కలిపి వస్తు ఉంటాయి. మచ్చలోని మధ్య భాగం ఉదా రంగు లేదా తెలుపు రంగులో కనిపిస్తాయి. రోజులు గడిచే కొద్దీ ఒక్కో మచ్చ కలిపి పెద్దగా మారి పసుపు రంగులో ఆకురంగులో మారిపోయి రాలిపోతుంటాయి. తెగుళ్లు ఎక్కువైనకొద్దీ ఆకుల నుంచి కాయలకు సోకుతుంది. ఆకులపై, ఆయలపై మచ్చలు ఏర్పడి, మొక్కల పెరుగుదల ఆగిపోయి కాయల నాణ్యత తగ్గిపోతుంది.
నివారణ:
విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. వేరే పంటలతో నేలలో పంట మార్పిడి చేసుకోవాలి. పంట మార్పునకు వరి, జొన్న, మక్కజొన్న పంటలతో మార్పిడి చేసుకుంటే లాభాలు ఆశించవచ్చు. తెగుళ్లు సోకిన ఆకులను ఏరి దూరంగా పారెయ్యాలి. లేదా కాల్చివేయాలి. కాఫర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

వేరుకుళ్లు తెగులు:

ఈ తెగులు సోకినప్పుడు ఆకులు వడిలి, పసుపు రంగులో మారి కిందికి వాలిపోతాయి. క్రమంగా మొక్కల మొదళ్ల వరకు చేరి మొదళ్లు కుళ్లిపోయేలా చేస్తుంది.
నివారణ: థైరమ్ 3 గ్రా/ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి, విత్తడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

దిగుబడి, కోత కోయడం:

విత్తిన 120-130 రోజులకు మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కాయలను కోసుకోవాలి. లేకపోతే కాయలు ముదురుగా మారిపోతాయి. ముదిరిన కాయ వల్ల ఎక్కువ లాభాలు ఆశించలేము.

తీగ రకాలైతే ఎకరాకు 3-5 టన్నుల, పొద రకాలైతే 1.5-2.5 టన్నుల దిగుబడిని ఇస్తాయి. పొద చిక్కులు 55-60 రోజుల్లో కోతకు వస్తుంది. రకాన్ని బట్టి 90-100 రోజుల పంట కాలం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.